సిరా న్యూస్, భీమదేవరపల్లి
వంగర బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులకు పాముకాటు
* ఎంజీఎం లో చికిత్స పొందుతున్న విద్యార్థినిలు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఆదివారం రాత్రి పాము కాటుకు గురయ్యారు. వంగర గ్రామానికి చెందిన రామారావు శరణ్య ఆరవ తరగతి, రంగయ్య పల్లి గ్రామానికి చెందిన ఎలబోయిన మౌనిక ఐదవతరగతి చదువుతున్నారు.ఆదివారం రాత్రి 9 గంటలకు స్టడీ అవర్ పూర్తవుగానే బాత్ రూమ్ కు వెళ్లిన క్రమంలో ఇద్దరమ్మాయిలను పాముకాటు వేసింది. గమనించిన పాఠశాల నర్స్ పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిలలను ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పిల్లలు పాము కాటుకు గురవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు రామారావు రాజు,ఎల్లబోయిన సురేష్ మాట్లాడుతూ పాము కాటుకు గురైన పిల్లలను కాలినడకన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.నర్స్ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ మీ పిల్లల్ని మీరు తీసుకెళ్లాలని సంతకం తీసుకున్నారని తెలిపారు. చికిత్స పొందుతున్న పిల్లల గురించి పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది పట్టించుకోవడంలేదని తెలిపారు.పాఠశాలలో రెండు చోట్ల బాత్ రూమ్ లు ఉన్నా చిన్నపిల్లలను దగ్గరగా ఉన్న బాత్ రూమ్ లోకికాకుండా, దూరంగా ఉన్న బాత్ రూమ్కు పంపుతున్నారని తెలిపారు. దగ్గరగా ఉన్న బాత్ రూమ్ లోకి చిన్న పిల్లలు వెళ్తే ఫైన్ వసూలు చేస్తున్నారని తెలిపారు.స్కూల్ ఆవరణలో గడ్డి పెరగడంతో పాములు ఏ క్షణంలో ఎటువైపు నుంచి వస్తాయోనని విద్యార్థినులు ఆందోళన గురవుతున్నారు.ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ పై ఉంటుంది.ఇవేమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.