పంట కాల్వల్లోకి వ్యర్థాలు

సిరా న్యూస్,వరంగల్;
ములుగు మండలం మల్లంపల్లి గ్రామ శివారులో శ్రీ అచ్యుత ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిలర్ రైస్ మిల్ ఏర్పాటు కొరకు యాజమాన్యం చుట్టుపక్క రైతులకు పంట నష్టం కలిగితే నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి, తీరా రైస్ మిల్లును ఏర్పాటు చేసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తూ.. బహిరంగంగానే నీటి వ్యర్థాలను సాగునీటి కాలువలలోకి మళ్లిస్తూ రైతుల పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పంట నష్టంపై యాజమాన్యం స్పందించకపోగా ప్రశ్నించిన రైతులపై దాడులు చేస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..శ్రీ అచ్యుత ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో పారా బాయిలర్ రైస్ మిల్ ఏర్పాటుచేసిన రైస్ మిల్ యజమాని నీటి శుద్ధి కోసం ట్యాంకులు నిర్మించకపోవడంతో బహిరంగ ప్రదేశంలో వ్యర్థపు నీటిని వదులుతుండటం వల్ల పంట కాలువలకు వెళ్లే నీటిలో కలుస్తూ సాగు నీరు కలుషితం అవుతుందని, వర్షాకాలంలో వర్షాల వల్ల రైస్ మిల్ వ్యర్ధాలు వర్షపు నీటితో కొట్టుకొచ్చి పంట పొలాల్లో మేటలు పెట్టడం వల్ల పంటను తీవ్రంగా నష్టపోతున్నామని చుట్టుపక్కల పంట పొలాల్లో దుర్వాసన వల్ల పనిచేయడం కూడా కష్టమవుతుందని, కనీసం రైస్ మిల్లులో పనిచేసే సిబ్బందికి మనమూత్ర విసర్జన కోసం టాయిలెట్లు నిర్మించకపోవడంతో రైస్ మిల్ సిబ్బంది చుట్టూ ఉన్న పంట పొలాల్లో కాలకృత్యాలు తీసుకుంటున్నారని తద్వారా పొలాల్లో పనికి కూలీలు ఎవరు రావడంలేదని రైతులు తమ ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.శ్రీ అచ్యుత ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాన్యం పారా బాయిలర్ రైస్ మిల్లు ఏర్పరిచే ముందు చుట్టూ ఉన్న రైతులతో ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ)కోసం తమ రైస్ మిల్ ద్వారా పంటలకు నష్టం వాటిల్లితే నష్ట పరిహారం చెల్లిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి రైతులతో ఎన్ఓసి పత్రాల పైన సంతకాలు తీసుకున్నాయి. తీరా బాయిలర్ రైస్ మిల్ ప్రారంభమయ్యాక అందులో నుండి వెలువడే వ్యర్థపు నీటిని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో విడిచిపెట్టడం ద్వారా చుట్టుపక్కల రైతుల పొలాల్లోని పంటలు నాశనం అవుతూ రావడంతో రైతులందరూ కలిసి యజమానిని సంప్రదించిన అందుబాటులోకి రాకపోవడంతో రైతులందరూ కలిసి బాయిలర్ రైస్ మిల్ వద్దకు వెళ్లగా అక్కడ ఉన్న సిబ్బందితో రైతులపై దాడి కూడా చేశారని తెలుస్తోందిమల్లంపల్లి లో పచ్చటి పొలాల మధ్య ఏర్పాటుచేసిన పారా బాయిలర్ రైస్ మిల్ యాజమాన్యం చుట్టుపక్కల రైతులకు చేస్తున్న పంట నష్టం సరిపోదని వారానికి రెండుసార్లు రైస్ మిల్ వ్యర్థాలను సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్, ట్రాక్టర్ల ద్వారా మల్లంపల్లి కి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో పడవేస్తూ అటవీ సంపదకు ముప్పు కలగ చేస్తున్నారని, సాగులో లేని ఇతర రైతుల పంట పొలాల్లో కూడా వ్యర్థపు నీటిని డంపు చేసి పర్యావరణానికి ముప్పు కలిగేలా చేస్తున్నారని మల్లంపల్లి గ్రామ యువత యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా మారుమూల గ్రామాల్లో పచ్చటి పొలాల మధ్య ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామని రైతులకు నమ్మ పలికి తీరా చుట్టూ ఉండే రైతులు పంటను నష్టం కలిగించే తమ సొంత లాభం కోసం యాజమాన్యం నిబంధనలు గాలికి వదిలేయడం పట్ల సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు గాలికి వదిలేసే బాయిలర్ రైస్ మిల్ ల అనుమతులను రద్దు చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *