సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వాచ్మెన్ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసారు. ఉప్పర బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనములో రామచంద్రయ్య వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. రెండవ అంతస్తులో రామచంద్రయ్య తలపై రాడ్డుతో దుండగులు కొట్టి చంపారు. భవన యజమాని వేణు మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మృతదేహం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
====