సిరా న్యూస్,బేల
చలివేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో గురువారం ఛత్రపతి శివాజి కూడలి వద్ద సామాజిక కార్యకర్త రాము భర్కాడే చలివేంద్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా పెరుగుతుందందున దూరం నుండి వచ్చే ప్రయాణీకులు, ప్రజల కోసం దాహం తీర్చుటకు ఈ చెలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జూన్ 08 దాకా కొనసాగిస్తానని అన్నారు. కార్యక్రమంలో దత్తా నికమ్, నవీన్ పోత్రాజ్, ఆకాష్ గుండావార్,కృష్ణ, గణేష్, దేవురావ్ తదితరులు పాల్గొన్నారు.