సిరా న్యూస్;
బోర్లు అడుగంటాయి. చెరువులు ఎండిపోయాయి. నదులు పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉన్న భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెరపైకి అనేక నిబంధనలు తీసుకొచ్చింది. వాటర్ సర్వీసింగ్ సెంటర్లను మూసివేసింది. నీళ్లను అడ్డగోలుగా వాడితే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తాగే నీటికి కటకట.. స్నానం వారానికి ఒక్కసారే.. ఇది ప్రస్తుతం దేశ ఐటీ రాజధాని బెంగళూరులో నెలకొన్న పరిస్థితి.మార్చి నెలలోనే బెంగళూరు వాసులు నీళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్నారంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బోర్లు ఎండిపోవడంతో బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. స్థానికులు అవసరాల కోసం ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో ట్యాంకర్ నిర్వాహకులు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో ఒక ట్యాంకర్ 600 నుంచి 1000 వరకు లభ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఆ ధర ఏకంగా రెండు వేలకు పెరిగిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరలు తగ్గించాలని హెచ్చరించడంతో ట్యాంకర్ నిర్వాహకులు నగరానికి రావడమే మానేశారు. దీంతో ప్రజలు అవసరాల కోసం ఆర్.ఓ ప్లాంట్ల మీద ఆధారపడుతున్నారు. అక్కడ కూడా ఒక్కొక్కరికి ఒక్కో క్యాన్ మాత్రమే ఇస్తున్నారు. ప్లాంట్ల వద్ద భారీగా క్యూ ఉండటంతో, నీటి కోసమే గంటలపాటు నిలబడాల్సి వస్తోందని బెంగళూరు నగరవాసులు అంటున్నారు. స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి తగినంత నీరు కూడా లభించడం లేదని వారు వాపోతున్నారు. వంట చేసుకోవడానికి కార్పొరేషన్ నీటిని కాచి, వడపోసి వినియోగిస్తున్నామని చెబుతున్నారు.. గత మూడు నెలలుగా తాము ఈ ఇబ్బంది పడుతున్నామని.. బెంగళూరు నీటి సరఫరా, సీవరేజ్ బోర్డు (బీఎం డబ్ల్యూ ఎస్ఎస్ బీ) అధికారులకు ఫోన్ చేసిన పట్టించుకోవడంలేదని అంటున్నారు.. నీటి కరువు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నన్ను వైట్ ఫీల్డ్ లోని ఓ హౌసింగ్ సొసైటీ కఠిన నిర్ణయం తీసుకుంది.. నీటి వినియోగాన్ని 20% తగ్గించకుంటే 5000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.తాగునీటి కరువు నేపథ్యంలో.. ప్రైవేటు వాటర్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంటామని ఉప ముఖ్యమంత్రి శివకుమార్ హెచ్చరించారు.. సమస్య పరిష్కారానికి అన్ని వాటర్ ట్యాంకులు తమ వివరాలను బెంగళూరు నగరపాలక కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు. లలో ఐదు రోజులు మాత్రమే స్నానం.. వంట చేయడానికి కూడా నీరులేక ఆన్లైన్ ఆర్డర్ చేసుకుని కడుపు నింపుకుంటున్నారు. ఇక త్రాగేతర పనుల కోసం శుద్ధి చేసిన నీటిని ఎంతో పొదుపుగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగర ప్రజల నీటి కష్టాలు ఇవి. అక్కడి నీటి సంక్షోభం తారా స్థాయికి చేరింది. గుక్కెడు తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే.. అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. మరోవైపు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయకపోవడంతో.. ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. డిమాండ్ పెరగడంలో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు.కొన్ని ప్రాంతాల్లో గత రెండు నెలలుగా ప్రజలు నీళ్ల కోసం నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. మరోవైపు ఎండాకాలం ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. మునుముందు రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో నగరంలో రోజుకు 2,600 నుంచి 2,800 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉంటే కేవలం 1,300 ఎంఎల్డీ నీరు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. దీంతో నీళ్ల ట్యాంకర్లు వచ్చినా సరిపోవడం లేదంటూ వాపోతున్నారు. నీటి కష్టాలు ఎప్పటికి తీరతాయో.. తమకు సాధారణ రోజులు ఎప్పటికి వస్తాయోనని తలలుపట్టుకుంటున్నారు.మళ్లీ వర్షాలు పడితే తప్ప పరిస్థితి మామూలు స్థితికి వచ్చేలా కనిపిచండం లేదని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో పాలకుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు రోడ్లు, అపార్ట్మెంట్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. భూగర్భ జలాలలపై ఎన్నడైనా కృషి చేశారా? ఇలాంటి చర్యలు ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారువారందరితో సమావేశమయ్యారు… మరోవైపు నీటి కొరతను నివారించేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 219 తాలూకాలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నాయని ప్రభుత్వం ఇటీవల నివేదికలో పేర్కొంది.