నీటి సమస్య పరిష్కారం కాలేదు

ఏమీ చేయలేదు..క్షమించండి
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
సిరా న్యూస్,విజయవాడ;
వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మా వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఏనాడు నీటి సమస్యను పరిష్కరించలేదని అన్నారు. 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలి. ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా అని ప్రశ్నించారు. అలా అయితేనే నిధులు విడుదల చేస్తారా ?. రెడ్డి సామాజికవర్గం ఓట్లు వేస్తేనే నేను ఎమ్మెల్యే కాలేదు. కులమతాలకు అతీతంగా సింగనమల ప్రజలు గెలిపించారు. మాట తప్పను.. మడమ తిప్పనన్న సీఎం జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుస్తున్నారు . నాకు టికెట్ కేటాయించట్లేదు అంటూ సీఎం చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏమాత్రం సహకరించలేదు. నా పట్ల, నా భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపారు. ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని సీఎంను అభ్యర్థించాం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *