సిరా న్యూస్, జైనథ్
పగిలిన పైప్లైన్.. రహదారికి ఇబ్బందులు
* పట్టించుకోని అధికారులు
* ఇబ్బందుల్లో గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాoడగడ గ్రామంలోని వాటర్ ట్యాంక్ నుండి వస్తున్న మెయిన్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో రోడ్ల పై నీరు ప్రవహించడంతో రోడ్డంతా బురదమయంగా తయారైంది. ఆ దారిలో వెళ్లేటటువంటి వ్యవసాయదారులకు అటువైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలు, చిన్నపిల్లలు ,వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ద్విచక్ర వాహనం గుంతలో పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పైప్ లైన్ సరి చేసిన తర్వాత మళ్లీ పగలడంతో దానిని పట్టించుకున్ననాధుడే లేరనిన గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామ స్పెషల్ ఆఫీసర్ సమస్యలను పరిష్కరించి, మాకు ఇబ్బంది కలగకుండా చూడాలని గ్రామస్తులు ప్రకాశ్, శ్రీకాంత్, పోచ్చరామ్, గంగారం, పురుషోత్తం, గణేశ్, ఆశన్న కోరుతున్నారు.