బద్వేలు సుమిత్రానగర్ లో నీటి కష్టాలు

 పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు

ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కొని ఏ ఈ , నీటి సరఫరా సూపర్వైజర్

మ్మెల్యే మాట కూడా ఖాతరు చేయని మున్సిపాలిటీ అధికారులు

ఆరు రోజులు ఒకసారి నీటి సరఫరా

సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ మున్సిపాలిటీలోని 9వ వార్డు, పదవ వార్డు, 14వ వార్డు, 15 వ వార్డు 16వ వార్డు కు మున్సిపాలిటీ అధికారులు నీటి సరఫరా సక్రంగా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా వార్డు ప్రజలు వాపోతున్నారు. త్రాగునీటి సరఫరా ఆరు రోజులకు ఒకసారి జరుగుతుందని, అది కూడా కేవలం ఒక్క గంట మాత్రమే సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల త్రాగునీటి సమస్యపై బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ దృష్టికి ప్రజలు తీసుకుపోగా ఎమ్మెల్యే స్పందించి గత ఆరు నెలల క్రితం
ఆమె అధికారుల సమావేశం ఏర్పాటు చేసి త్రాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బంది చేయవద్దని రోజు మార్చి రోజు అందించాలని ఆదేశించారు. అన్నింటికన్నా ప్రజల కు త్రాగునీరు ఎంత అవసరమని త్రాగునీటి సరఫరా లో ప్రజలకు ఇబ్బంది చేస్తే తగు చర్యలు తీసు
కుంటామని అధికారులకు, నీటి సరఫరా ఏ ఈ కి మరియు సూపర్వైజర్లకు హెచ్చరికలు చేశారు. కానీ ఎమ్మెల్యే మాట గాలికి వదిలేసి ఎమ్మెల్యే మాట కూడా ఖాతరు చేయకుండా యధాతధంగా వ్యవహరిస్తున్నారు అనిఅంటున్నారు. గతంలో బద్వేల్ మున్సిపాలిటీ ఏఈగా “కార్తికేయ” పనిచేస్తున్నప్పుడు నీటి సరఫరా సక్రమంగా జరిగేదని, ప్రస్తుతం ఏఈ గా పని చేస్తున్న“ జగదీష్” కు నీటి సరఫరా లో అవగాహన లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. బద్వేల్ మున్సిపాలిటీకి నీటి సరఫరా కోసం బ్రహ్మ సాగర్ లో పుష్కలంగా నీళ్లు ఉన్నా మరి ఎందుకు నీటి సరఫరా చేయడంలో ఎందుకు విఫలమైతున్నారు అర్థం కావడం లేదని అంటున్నారు. మున్సిపాలిటీ ఏఈ జగదీష్ కు అవగాహన లేకపోవడ మో లేక నిర్లక్ష్య ధోరణి కావడ మో అర్థం కావడం లేదని అంటున్నారు, ఏ ఈ సూపర్వైజర్ల నిర్వహణ వల్ల త్రాగునీటి ఇబ్బందులు పడుతున్నా మనీ అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, మున్సిపాలిటీ అధికారులు నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి పెట్టి” కార్తికేయ” ఏఈ గా ఉన్నప్పటి పద్ధతినే పాటిస్తే నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందని రోజు మార్చి రోజు నీరు సరఫరా జరిగే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి త్రాగునీటి నీ రోజు మార్చి రోజు అందించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *