మార్కెట్ డిమాండ్ అనుగుణంగా మన నైపుణ్యాలను అప్ డేట్ చేసుకోవాలి

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

 సిరా న్యూస్,పెద్దపల్లి;
మన కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మార్కెట్ డిమాండ్ ప్రకారం ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలను అప్ డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యేచింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి పట్టణంలోనీ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న జిల్లా సమాఖ్య భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన టాస్క్ నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తోకలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులకు విద్యార్హతలతో పాటు ఇతర నైపుణ్యాలు ఉంటే ఉపాధి లభిస్తుందని, మార్కెట్ లో వివిధ కంపెనీలకు అవసరమైననైపుణ్యాలను విద్యార్థులకు ముందస్తుగా అందించి ఉద్యోగ నిర్వహణకు వారిని సన్నద్ధం చేసేందుకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు పెద్దపల్లిజిల్లాలో టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభించామని, జూన్ మాసంలో కంపెనీలు ఉపాధి డ్రైవ్ చేపడతాయని, అంతకంటే ముందు ఒక బ్యాచ్ కు శిక్షణ అందించి వారిని సన్నద్ధం చేసేందుకు టాస్క్ సెంటర్ త్వరగాఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, టాస్క్ సెంటర్ ద్వారా విద్యార్థులకు 110 కు పైగావివిధ రకాల కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ అవకాశాలను యువత వినియోగించుకొని జీవితంలో ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

మన జీవితంలో ఆశించిన లక్ష్యాన్ని సాధించేందు కు మననైపుణ్యాలను ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేసుకోవాలని, నూతన అంశాలను ఎప్పటికప్పు డు నేర్చుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. యువత నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తామని,వారికి అవసరమైన గైడెన్స్, నైపుణ్య శిక్షణను టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి టాస్క్ నైపుణ్య శిక్షణకేంద్రం ఉపయోగపడుతుంద ని, ఉద్యోగం కోసమే కాకుండా చిన్న, చిన్న వ్యాపారాలు ప్రారంభించడం కోసం అవసరమైన గైడెన్స్ సైతం టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు. పోటీ ప్రపంచంలో మనం నిలదొక్కుకోవాలంటే మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలని, ప్రపంచంలో వస్తున్న మార్పులకు సన్నద్ధం కావాలని, గతంలో కేవలం విద్యార్హతలతో మాత్రమే ఉద్యోగాలు లభించాయని, ప్రస్తుతం విద్యార్హతలతోపాటు తప్పనిసరిగా నైపుణ్యాలు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ చాలా అవసరమని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో 1500 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని,వారిలో 300 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని, 500 మంది ఎంపిక ప్రక్రియలో ఉన్నారని, అవసరమైన శిక్షణను అందించేందుకు టాస్క్ సెంటర్ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *