-మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి
-కన్నాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంథని మున్సిపల్ పాలకవర్గం
సిరా న్యూస్,మంథని;
కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులకు మా కుటుంబ సభ్యుల సహకారముతో ప్రతి నెల వేతనం అందజేస్తామని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి అన్నారు.
శనివారం మంథని మండలం కన్నాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి తన పాలకవర్గ సభ్యులతో కలిసి సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలను నాటారు.. ఆలయంలో పనిచేస్తున్న అర్చకులకు ఖర్చుల నిమిత్తం 9వేల రూపాయలను చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రమా సురేష్ రెడ్డి మాట్లుడుతూ మా కుటుంబ సభ్యులు మస్కుల నారాయణ రెడ్డి కుమారుడు శ్రావణ్ రెడ్డి సహకారముతో ప్రతి నెల 9వేల రూపాయలు ఆలయ అర్చకులకు వచ్చే విధంగా సహాయం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముస్కుల సురేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్లు గుండా విజయలక్ష్మి పాపారావు, కుర్ర లింగయ్య,కొట్టె పద్మ రమేష్, వి.కె రవి, వేముల లక్ష్మి సమ్మయ్య , భక్తులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.