సిరా న్యూస్,గుంటూరు;
గుంటూరు నగరంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్,పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని పిడుగురాళ్ల మాధవి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ,నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ హిజ్రాలు సమస్యలు విన్నవించుకున్నారు. వారికి సొంత ఇళ్ళు లేవు. వారికి అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తాం. వారికి నెలవారీ ఫించన్ పెంచాలని కోరారు. కూటమి అధికారలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ హిజ్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం. ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. రానున్న రోజుల్లో కూటమి అధికారంలోకి రావటం తధ్యమని అన్నారు.