డోన్ లో టిడిపి జెండా ఎగరవేస్తాం చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తాం

సిరా న్యూస్,బేతంచర్ల;
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,లు 2024 ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అందులో నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ స్థానం మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి,ని ఖరారు చేయడంతో ధోని నియోజకవర్గం లోని డోను ప్యాపిలి బేతంచర్ల మండలాలలో టిడిపి శ్రేణులు బాణాసంచా పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు బేతంచర్ల పట్టణంలో నంద్యాల కర్నూలు జిల్లాల సర్పంచ్ సంఘంల అధ్యక్షుడు కే శ్రీనివాసులు యాదవ్,ల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో వానసంచ పేల్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ లో టిడిపిని గెలిపించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడు కి గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పుట్టపాశం వెంకటేశ్వర్లు,గుటుపల్లి ముల్లా,సిమెంట్ నగర్ సుభాన్,పిల్లి అశ్వత్ నారాయణ,చల్ల మద్దిలేటి స్వామి,నాయిని రామకృష్ణ,రవి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *