సిరా న్యూస్,హైదరాబాద్;
వీర శైవ లింగాయత్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపి సురేష్ షెట్కర్ ఆధ్వర్యంలో వీర శైవ లింగాయత్ లు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ కు సంబంధించిన అధ్యక్షులు సంగమేశ్వర్, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ ఇతర కార్యవర్గ సభ్యులు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 100% వీరశైవ లింగయ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాం. కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత మాది. ప్రభుత్వంలొ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ మంత్రిగా సురేష్ అన్న మిత్రుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మాట ఇస్తున్నానని అన్నారు.