ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం

-ప్రజలకు అండగా ఉంటాం
-మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమాసురేష్ రెడ్డి
 సిరా న్యూస్,మంథని;
ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ ప్రజలకు అండగా ఉంటామని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి అన్నారు. శనివారం మంథని పట్టణంలోని చైతన్యపురి కాలని లో చిన్న వర్షానికే రోడ్డు పై నీరు నిల్వ ఉంటుంది అని తెలుసుకొని తక్షణమే మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి,స్థానిక కౌన్సిలర్ గుండా విజయ లక్ష్మి పాప రావు తో కలిసి ఆ ప్రాంతాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి సందర్శించారు. చైతన్య పురి వార్డు ప్రజలు చిన్న వర్షానికే ఈ ప్రదేశాలలో జలమయంగా మారుతుందని దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఈ సమస్యను పరిష్కరించాలని చైర్పర్సన్ కు అక్కడి ప్రజలు వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్ అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ కొట్టే పద్మ – రమేష్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *