లోక్ సభ ఎన్నికలలో 370 నుండి 400 పై చిలుకు సీట్లను సాధిస్తాం

 సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపి రెండు సీట్లతో మొదలై నేడు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలలో కేవలం బిజెపి పార్టీ అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలోనే అగ్రగామి పార్టీలలో బిజెపి ఉన్నత శిఖరాన్ని అధిరోహించిందని కొనియాడారు. ఎందరో మహానుభావులు బిజెపి ప్రధాన మంత్రులై దేశాన్ని పరిపాలించారని గుర్తు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికలలో 370 నుండి 400 పై చిలుకు సీట్లను దైవసం చేసుకుంటుందని భీమాను వ్యక్తం చేశారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *