మార్పు, అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమమే కూటమి ధ్యేయం
సిరా న్యూస్,కర్నూలు;
ఉమ్మడి అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర రెడ్డి గెలుపు కోసం టిడిపి జనసేన బీజెపీ పార్టిలకు చెందిన ప్రతి కార్యకర్త ఐక్యతతో కలిసి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఉమ్మడి పార్టీల నాయకులు బేతాళ బడేసా, యన్ వి రామంజి నేయులు, గానిగ బాషా, షేక్షవలి మహేష్ తెలిపారు, జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జి రేఖగౌడ్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనెగండ్ల లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు, అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరు పడితే వారు జనసేన పార్టీ నాయకులని చెప్పుకుంటూ వారి స్వలాభం కోసం ఇతర పార్టీలలో చేరుతున్నట్లు ప్రజలను జనసేన కార్యకర్తలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వారి కుటిల రాజకీయాన్ని తరిమికొట్టి మేమంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజలతో మమేకమై బీవీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు, అధికార పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకొని ఏవిధంగా ఉమ్మడి పార్టీల ఓట్లు చిల్చాలి అనే పనిలో వారు పూర్తిగా నిమగ్నమై కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని వాటిని బలంగా తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు, అధికార పార్టీకి ఓటమి తప్పదని డబ్బులు ఎరవేసి వలసలను ప్రోత్సహిస్తున్నా ఓటమి భయం మాత్రం వెంటాడుతునే ఉందన్నారు, ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అధికారం కూటమిదే ఎమ్మిగనూరు విజయం బీవీ జయ నాగేశ్వర రెడ్డి దే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు డీలర్ ఫకృద్ధిన్, రహంతుల్లా, జనసేన నాయకులు, మాలిక్, ఖాసిం సాహెబ్, సుభాన్, ఇస్మాయిల్, దూద్ పీరా, బీజెపీ నాయకులు, మహేష్, ముని స్వామిగౌడ్, పాల్గొన్నారు.
==============================