సిరా న్యూస్,సిరిసిల్ల;
ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామానికి చెందిన అంకారపు మల్లేశం (54) అనే వ్యక్తి అత్మహత్య చేసుకున్నాడు. గత కొద్ది చేనేత వస్త్ర రంగంలో సంక్షోభం ఏర్పడడంతో చేతినిండా ఉపాధి లేక తీవ్ర మనోవేదన చెంది గ్రామ శివారు ప్రాంతంలో చింత చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య భారతి, కొడుకు మహేందర్, కూతురు మనిషా ఉన్నారు.