పల్లాకు ఘనస్వాగతం

 సిరా న్యూస్,విశాఖపట్నం;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నియమితులై మొట్టమొదటిసారిగా విశాఖ వస్తున్న సందర్భంగా ఎయిర్పోర్టులో టిడిపి, జనసేన బిజెపి నాయకులు కార్యక ర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే ఘన స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలి పారు.నా పై ఉంచిన నమ్మకాన్ని కాపాడు కుంటానని,అగనంపూడి టోల్ గేట్ మూసివేతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ రోజు నుంచే స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యత పూర్తిగా తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన గాజువాక ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *