మేమంతా సిద్దం: వైసిపి మండల యువ నాయకుడు గురునాథ్ రెడ్డి
సిరా న్యూస్,కౌతాళం;
ప్రజలకు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకలే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి గ గెలిపిస్తాయని మంత్రులు నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని వైసిపి నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శని వారం బాపురం గ్రామంలో మండల సచివాలయ కన్వీనర్ వెంకటరామిరెడ్డి అధ్యక్షతన మేమంతా సిద్ధం అనే నినాదాన్ని బాపురం, దొమ్మలదిన్నె ,విరలదిన్నె, వైసిపి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ,అభివృద్ధి, గురించి వివరిస్తూ మరొకసారి ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ని, సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిపించు కుందామని గ్రామ వైసిపి నాయకులకు, కార్యకర్తలకు , సచివాలయ కన్వీనర్లకు, వార్డ్ మెంబర్లకు, దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నర్సిరెడ్డి, రాఘవరెడ్డి కుమార్ గౌడ్, బసవరాజు గౌడ్, ఉప సర్పంచ్ రామాంజనేయులు, జైపాల్, దశరథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఉమేష్ స్వామి, గిరి స్వామి, విరలదిన్నె మౌలా, నాగన్న గౌడ్, వడ్ల వీరేశ్ ఆచారి, నాగప్ప కార్యకర్తలు పాల్గొన్నారు