బుద్దా వెంకన్న
సిరా న్యూస్,విజయవాడ;
లోకేష్ పాదయాత్ర మూడు వేలు కిలోమీటర్ల అయిన సందర్భంగా కేక్ కట్ చేశాం. లోకేష్ పాదయాత్ర ను, చంద్రబాబు యాత్రలను అడ్డుకట్టవేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.
జగన్ అన్యాయం గా చంద్రబాబు, లోకేష్ పై కేసులు పెట్టాడు. భవిష్యత్ లో కనివిని ఎరుగని పాదయాత్ర చేశాడు. జగన్ పాదయాత్ర డబ్బు, లిక్కర్ మీద నడిచింది. లోకేష్ పాదయాత్ర లో పేదల యాత్రగా జరిగింది. పశ్చిమ నియోజకవర్గం లో అనేక కార్యక్రమాలు చేశాం. పశ్చిమ నియోజకవర్గం లో పసుపురంగు జండా ఎగరవేస్తాం. పార్టీ కి సుప్రీం చంద్రబాబు.. ఎవరు పడితే వాళ్ళటం విడ్డూరంగా ఉంది. పార్టీ లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు పక్కన నిలబడతారో.. వాళ్ళకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారు. విజయవాడ పశ్చిన నియోజకవర్గం బీసిలకు అయితే.. నాకు బుద్ద వెంకన్న కు ఇస్తారు.. ముస్లిం అయితే నాగుల్ మీరాకు ఇస్తారని అన్నారు.
చంద్రబాబు నాయుడు ఎవరుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారో.. ఎదురు చూస్తాను. చంద్రబాబు నాయుడు మాటకు కట్టుబడి ఉంటాం. పార్టీ కోసం కష్టపడేవారికే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారు. విజయవాడ పశ్చిన ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికి ఇచ్చిన పని చేస్తాం. జలిల్ ఖాన్ మాటలకు నేను స్పందించనని అన్నారు.