Etala Rajender : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు.

 సిరా న్యూస్,మల్కాజ్ గిరి ;

చెంగిచెర్ల, శివ దుర్గ కాలనీలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ
గత ఎంపీ రేవంత్ రెడ్డిని ఐదేళ్లు క్రితం ప్రశ్నించే గొంతు అని ప్రజలు భావించి పార్టీ బలహీనంగా ఉన్నా ఓట్లు వేసి, గెలిపించారు. కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చూడడానికి గానీ, సమస్యలు తెలుసుకోవడానికి ఆయన ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్‌ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చెత్త బుట్టలు వేసినట్టే అన్నారు.

తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు, ఐటీ అభివృద్ధి, రోడ్లు, కార్యాలయాలు రావాలంటే బీజేపీ పార్టీ వల్లనే సాధ్యం అని దేశంలో మళ్ళీ వచ్చేది బిజెపి ప్రభుత్వం అన్నారు.

నేను నేరుగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఈ ప్రాంతంలోని సమస్యల పై నేరుగా చర్చించగలను. మీరందరూ విజ్ఞులు, బాగా ఆలోచించి మీ ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో విద్య సాగర్, అమరేంద్ర రెడ్డి, కప్పరా ప్రసాద్, సుదర్శన్ రెడ్డి, గొనె శ్రీనివాస్, మహేష్, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *