సిరా న్యూస్,విజయవాడ;
ఓ పత్రికలో తనపై వచ్చిన అవినీతి కథనం పై ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయ భాను తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన కథనాన్ని ఖండించారు. అనం తరం మాట్లాడుతూ ప్రతిసారి ఎన్నిక లు వచ్చినప్పుడే దినపత్రికలు పనిగ ట్టుకొని తాను తన కుటుంబ సభ్యు లపై అవినీతి కథనాలు ప్రచురిస్తూ విషం కక్కడం ఆనవాయితీగా మా రిందని అన్నారు. ఎన్నికల సమయం లో కాకుండా ఐదేళ్ల కాలంలో తన అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలే కపోతున్నారని నిలదీశారు. తాను అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని ట్రాన్స్పోర్ట్ తదితర వ్యాపారాలు తనకున్నాయని స్పష్టం చేశారు. తన అవినీతిని నిరూపించే దమ్ము ఉన్నాయా అని ప్రశ్నించారు కేవలం తనపై బురద జల్లి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.
================