పెద్దపెల్లి గడ్డపై ‘పెద్దన్న’గా నిలిచేదేవరో ..
సింగరేణి అండ.. ఎవరికో పూదండ
బొగ్గు గని కార్మికులే గెలుపు ఓటముల నిర్ణేతలు
పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖచిత్రం
సిరా న్యూస్,కమాన్ పూర్;
పెద్దపల్లి జిల్లా;
పోరాటాల గడ్డ పెద్దపల్లి ఎంపీగా గెలిచి పార్లమెంటు లో అడుగుపెట్టేది ఎవరో త్రిముక పోటీలో పెద్దపల్లి నాయకుడు ఎవరు కారున్నారో చూడాల్సిందే.
విప్లవ వీరులను అందించిన పెద్దపల్లి లోకసభ స్థానానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది వామపక్ష ఉద్యమానికి ఊపిరిలోదిన సోదరులు కిషన్ జి వర మల్లోజుల కోటేశ్వరరావు మల్లోజుల వేణుగోపాలరావు పెద్దపెల్లి బిడ్డలే వీరే కాకుండా అనేకమంది అగ్ర నేతలుగా ఎదిగారు. సింగరేణి బొగ్గు గనులు, పచ్చని పొలాలు, తెలంగాణ సాగు దశను మార్చే కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, ఎన్టీపీసీ, సిమెంట్ పరిశ్రమలు, యూరియా కర్మాగారం.. ధర్మపురి, కాళేళ్వరం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నెలవు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం. నైసర్గికంగానే కాకుండా రాజకీయంగానూ విభిన్నత, వైవిధ్యం దీని సొంతం. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఈ నియోజకవర్గం ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది.
పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నియోజకవర్గం కాక ఫ్యామిలీకి కంచుకోట కాగా, గత రెండు పర్యాయాలు కారు జోరు చూపించింది. ఈసారి కారు జోరుకు బ్రేకులు వేసేందుకు హస్తం పార్టీ కాక మనుమడు, ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణను పెద్దపెల్లి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దింపగా, బిజెపి పార్టీ కూడా గోమాస శ్రీనివాస్ ను రంగంలోకి దించింది. దీంతో ఈ నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎలాగైనా పూర్వ వైభవాన్ని సాధించాలని హస్తం పార్టీ కసితో పనిచేస్తుండగా.. అధికార పార్టీకి దీటుగా బీఆర్ఎస్ మరోవైపు బిజెపి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సింగరేణి కార్మికుల ప్రభావం అధికంగా ఉండే ఈ సెగ్మెంట్లో గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీదే హవా కొనసాగుతోంది.
గత పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని భారీ విక్టరీతో తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. మరోవైపు బిజెపి కూడా ప్రధాని మోదీ చెరిస్మాతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. మొత్తానికి మూడు పార్టీలు కూడా తగ్గేదిలే అన్నట్లుగా ఎత్తుకు పైఎత్తులతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. పెద్దపెల్లి, మంచిర్యాల, జగిత్యాల నియోజకవర్గం పరిధిలో విస్తరించిన ఈ లోకసభ నియోజకవర్గం పరిధిలో పెద్దపెల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 15 లక్షల 94 వేల 392 ఓట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈ ఏడు శాసనసభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 6 లక్షల 82 వేల 33 ఓట్లు సాధించి తిరుగులేని ఆదిపత్యాన్ని చెలాయించింది కాంగ్రెస్ పార్టీ. కాగా ప్రధాన ప్రతిపక్షం బి ఆర్ ఎస్ పార్టీకి 3 లక్షల 36 వేల 374 వేల ఓట్లు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిన పెద్దపల్లి లో గత శాసనసభ ఎన్నికల్లో పూర్తి రివర్స్ ఫలితాలు వచ్చాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని కలలుగంటున్న బిజెపికి గత శాసనసభ ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 79 వేల 418 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను సాధించగా, పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పు వచ్చిందనే ఆశతో ప్రతిపక్ష పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా, సీనియర్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి రంగంలోకి దించింది.