సిరా న్యూస్, పెంబి:
పక్కాగా 6 గ్యారెంటీలు..
– ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
+ దళారులను నమ్మి మోసపోవద్దని హితువు
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పక్కగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఆయన పెంబి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 9 ఏండ్లలో నియోజక వర్గం ఎంతగానో మోసపోయిందన్నారు. ఏ ఒక్కరికి కూడ డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో అని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. దశల వారీగా ఎన్నికల్లో ఇచ్ఛిన అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. తాను అందరి వాడినని, ఎల్లవేళల ప్రజలతోనే ఉంటానని అన్నారు. ఏ కష్టం వచ్చిన తన తలుపు తట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భుక్యా కవిత గోవింద్, స్పెషల్ ఆఫీసర్ అమర్జీ, ఎంపీడీవో సుధాకర్, ఎంపీవో రత్నాకర్ రావు, కాంగ్రేస్ పార్టి మండల అధ్యక్షుడు సల్ల స్వప్నిల్ రెడ్డి, సర్పంచ్ పూర్ణ చంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.