సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ వ్యవస్థను పెట్టి ఓటర్లను ప్రజలను బెదిరిస్తున్నారని.. ప్రజాధనంతో పార్టీ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే విపక్షాలన్నీ వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని వైసీపీ నేతలు.. టీడీపీ వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ అధినేత.. తాము వాలంటీర్ వ్యవస్థను తీసేయబోమని ప్రకటించారు. ఇంకా వారికి మెరుగైన అవకాశాలు కలిపిస్తామని.. కానీ వైసీపీకి మాత్రం ఊడిగం చేయవద్దని అంటున్నారు. 2019లో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటవుతూనే సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒకరి చొప్పున గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. ఈ వ్యవస్థ ద్వారా సుమారు రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమపథకాలను అందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శతో మొదలైన ఆరోపణలు ఇటీవలి కాలంలో ఎక్కువైయ్యాయి. తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. వాలంటీర్లు అందరూ అధికార పార్టీకి ఓ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆంధ్రాలోని మహిళలు కనిపించకుండా పోవడంలో వాలంటీర్ల హస్తం ఉందన్న జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఈ ఆరోపణల్లో భాగమే. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇప్పటికి కూడా ఆ వివాదం చల్లారలేదు. మరోసారి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. దీంతో ఈ సారి ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమవుతుందో అని వాలంటీర్లలో సైతం భయాందోళనలు నెలకొన్నాయి. వాలంటీర్లను తమ వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ఓ కీలక ప్రకటన చేశారు. అయితే ఇది ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాలను ఉరకలెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ దూకుడు చూపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పెనుకొండలో జరిగిన టీడీపీ-జనసేన పార్టీ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ వాలంటీర్లకు అభయం ఇచ్చారు. ఇన్నాళ్లూ వాలంటీర్లు ప్రవేటు స్పైలుగా పనిచేస్తూ ప్రజల డేటాను ప్రభుత్వానికి చేరవేస్తున్నారంటూ విరుచుకుపడ్డ చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడటంతో వాలంటీర్ల విషయంలో తమకు సానుభూతి ఉందంటున్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే తొలగిస్తామన్న భయం వాలంటీర్లకు అక్కర్లేదని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వాలంటీర్ వ్యవస్థను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని, వాలంటీర్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘‘ఒక్క వాలంటీర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించం. ప్రజలకు ఇన్నాళ్లూ సేవ చేసిన వాలంటీర్లకు న్యాయం చేస్తాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయంతో వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు’’ అని హామీ ఇచ్చారు.ఇన్నాళ్లూ వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు, టీడీపీ విమర్శఇంచాయి. వాలంటీర్ వ్యవస్థను తమవైపు తిప్పుకోవడానికే చంద్రబాబు ఈ హామీలు ఇస్తున్నారనడంలో సందేహం లేదు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని వాలంటీర్లు వైసీపీకే ఓటు వేయకుండా.. వైసీపీకి పని చేయకుండా..చేయడానికే చంద్రబాబు ఇలాంటి ప్రకటన చేశారని ఎక్కువ మది భావిస్తున్నారు. మంత్రులు, మాజీ మంత్రుల వ్యాఖల దుమారం మధ్యనే చంద్రబాబు మాత్రం తన మాట నమ్మండి, కచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని పునరుద్ఘాటిస్తున్నారు. వాలంటీర్లలోనూ ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలత లేదన్న వాదన ఉంది. ఐదేళ్లుగా ఐదు వేల రూపాయలకే పని చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇతరత్రా.. తాయిలాలు ఇస్తున్నారు కానీ.. ఎలాంటి ఉద్యోగభద్రత లేదు. ఎలాంటి అవకాశాలు వస్తాయన్న ఆశలు కల్పించడం లేదు. కనీసం ఉద్యోగప్రకటనల్లో రిజర్వేషన్లు అయినా కల్పిస్తారంటే అలాంటి పరిస్థితి కూడా లేదు. భవిష్యత్ లో జీతం పెంచుతారని కూడా లేదు. అందుకే వాలంటీర్లకు తమ భవిష్యత్ బై బెంగ ఉందన్న అభిప్రాయం ఉంది.వాలంటీర్లు ఫలితాలను మార్చలేరని.. వారు బెదిరింపులకు పాల్పడితే.. అది ప్రభుత్వానికే ఎక్కువ నష్టం జరుగుతుందని విపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి కుటుంబం వివరాలను వాలంటీర్లు సేకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వాలంటర్లను వ్యతిరేకం చేసుకోవడం ఎందుకన్న భావనతోనే.. తాము వచ్చినా ఉద్యోగాలుంటాయన్న భరోసా ఇస్తున్నారని అంటున్నారు.
======================