ప్రశ్న ఇచ్చి.. పారిపోతారా.?

జగన్ ను అసెంబ్లీలో దులిపేసిన హోం మంత్రి
సిరా న్యూస్,విజయవాడ;
వైసీపీ నేతలపై దాడులు జరిగాయా? లేదా? అని ప్రశ్న పంపించి.. అసెంబ్లీకి రాకుండా పోతే ఎలా అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యంగాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్బంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్లు ప్రశ్నవేసి.. సభకు రాలేదని ఎద్దేవా చేశారు. నిజానికి టీడీపీ వాళ్లను చంపి అదేదో తాము చేసినట్టు ఆరోపిస్తున్నారని, అధికారం కోల్పోయి.. 11 సీట్లు సాధించాక టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీవెళ్లి అక్కడ దీక్షచేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నలుగురు చనిపోతే ముగ్గురు టీడీపీకి చెందిన వారు ఉన్నారని, దానికి సంభందించి కేసు నెంబర్లతో సహ వెల్లడించామని హోం మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *