Williams: కళ్యాణదుర్గం ఎంఈఓ ను బదిలీ చేయండి : జై భీమ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విలియమ్స్

సిరాన్యూస్‌, కళ్యాణ్ దుర్గం
కళ్యాణదుర్గం ఎంఈఓ ను బదిలీ చేయండి : జై భీమ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విలియమ్స్

కళ్యాణదుర్గం ఎంఈఓ ను బదిలీ చేయాల‌ని జై భీమ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విలియమ్స్ అన్నారు. సోమ‌వారం కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మితకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసంద‌ర్బంగా జై భీమ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విలియమ్స్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రైవేట్ పాఠశాలలు, అధిక ఫీజులు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం లేదని తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా కూడా ఎంఈఓ, ఫోన్ ద్వారా చెబితే నేను చెయ్యను, నాకు పేపర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలని సమాధానం చెప్పి ఫోన్ కట్ చేస్తుందన్నారు. అంతేగాక పాఠ్యపుస్తకాలు ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ ఎంఈఓ కు తెలిపితే, ఎంఈఓ ద్వారానే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు ఫోన్లు చేసి పాఠ్యపుస్తకాలు ఉన్న రూములను తాళాలు వేసుకొని వెళ్లిపోయేలాగా వీరే వారికి సలహాలిస్తున్నారు. ఇలాంటి ఎంఈఓ ఉండటం కంటే బదిలీ చేస్తే కళ్యాణదుర్గం మండలంలో పేద విద్యార్థులు చదువుకోటానికి అవకాశం ఉంటుందని, తక్షణమే కళ్యాణదుర్గం ఎంఈఓ ని బదిలీ చేయాలని ఆర్డిఓ ని కోరారు. ప్రవేట్ పాఠశాలలకు పూర్తి సహకరిస్తున్న ఎఈఓ ని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *