– ప్రొఫెసర్ నతాని మేలు
సిరా న్యూస్, పెద్దపల్లి;
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రొఫెసర్ నతాని మేలు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గం వలస నాయకులతో నిండిపోయిందన్నారు. వారికి అడ్డ కాకూడద న్నారు. ఎంపీ అభ్యర్థులు దాదాపు అందరూ ఈ నియోజకవర్గంతో సంబంధం లేని వారు కాగా వీరి వల్ల ఈ నియోజకవర్గము వెనుకబడి పోయింద న్నారు. విద్యా, వైద్య రంగాల్లో చూస్తేతే ప్రభుత్వం జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు చాలా తక్కువ అందరూ వరంగల్, హైదరాబాద్ వెళ్లవలసిన దుస్థితి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక్కడి ఇసుక, బొగ్గు మనకు ఏలాంటి ఉపయోగం లేకుండా పోతుందన్నారు. యువత నిరుద్యోగ సమస్యలు వెంటాడుతూ దూర ప్రాంతాలకు పోతున్నారన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గత 30 ఏళ్ళుగా సాగుతున్నా ఇప్పటికి సరైన రహదారులు లేవన్నారు. మన నియోజక వర్గం అన్ని రంగాల్లో వెనుక బాటుకు ప్రధాన కారణం వలస నాయకులే అన్నారు. మన బాధలు మనం నెరవేర్చుకోవాలంటే స్థానికునికి పట్టం కట్టాలన్నారు. తాను కొలనూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా సుల్తానాబాద్ లో చదివి, ఇక్కడ ఉపాధ్యా యునిగా, ప్రధానోపాధ్యాయినిగా, మండల విద్యాధికారిగా పనిచేసిన అనుభవం ఉందని, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశం లో పల్లెల వీరస్వామి, బంద్ సొసైటీ అధ్యక్షులు దొడ్డి బాపు, జంగ మహేందర్ రెడ్డి, కర్రె మహేందర్ రెడ్డి, యాలాద్రి సపోజ్ తదితరులు పాల్గొన్నారు.