– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి పిలుపు
సిరా న్యూస్,పరవాడ;
డ్రైవర్లకు ఉరుతాడు లాంటి బి ఎన్ ఎస్ చట్టం తీసుకురావడం దుర్మార్గమైన చర్యని కేంద్ర బిజెపి ప్రభుత్వం పాత రోడ్డు రవాణా చట్టాన్ని 2023 డ్రైవర్లకు వ్యతిరేకంగా మోటార్ కార్మికులకు నష్టం చేసే చట్టం చేసిందనిదీనివలన డ్రైవర్లు మెడపై ఉరుతాడుగా ఉన్న బిఎంఎస్ చట్టంలోని కఠినమైన షరతులను మార్పు చేయాలని ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరుగుతున్న మోటార్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఆదివారంఅనకాపల్లి జిల్లా ఆటో కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో పరవాడ మండలం లంకెలపాలెంలో ఆదివారం సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం పరవాడమండల గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బి ఎన్ ఎస్ 106 సెక్షన్ ఒకటి మరియు రెండు రద్దు చేయాలని జీవో నెంబర్ 21నిపూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాల అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకితీసుకురావాలని డిమాండ్ చేశారు ఈనెల 16న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెలో మోటార్ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని
గని శెట్టి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులునర్సింగరావు, రామారావు, అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.