ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం

సిరా న్యూస్,విజయవాడ;
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి రాజేంద్రనాథ్ ఎన్.టి.ఆర్.జిల్లా, జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిదిలోని మద్రాస్ సిమెంట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ క్యాంపస్ లోని ఎంప్లాయిస్ ట్రైనింగ్ సెంటర్ లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. .సమీక్షా సమావేశంలో ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ పరిధిలో కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు, మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా అరికట్టడం, చేడు నడత కలిగిన వారిపై నగర బహిష్కరణలు, అలవాటు పడిన నేరస్తులపై పి.డి.యాక్ట్ లు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలగు అంశాలపై ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అన్న విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా దొంగతనం కేసులు, కోట్లట కేసులు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరుగు నేరాలు ఘననీయంగా తగ్గినాయి అని, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా అధిక సంఖ్యలో శిక్షలు పడినాయని గుర్తించి జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని డీజీపీ అభినందించారు.
ఈ సంధర్భంగా డీజీపీ పోలీసు శాఖ సమర్థవంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని తెలియచేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగులో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందిస్తామని తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *