సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై బీరు బాటిల్ తో ఓ వ్యక్తి దాడి చేసాడు. దాడికి తెగబడ్డ వ్యక్తి పేరు సత్య బర్మాన్ వ్యక్తిగా గుర్తించారు. ఆ వ్యక్తి గంజాయి మత్తులో ఉన్నాడు. మహిళపై దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తి పై కూడా దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన మహిళను మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కాకినాడ డి.ఎస్.పి హుటాహుటిన పోలీస్ సిబ్బందిని ఘటన స్థలానికి పంపించి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..