సిరాన్యూస్, సొనాల
ఆదివాసీ మహిళ అదృశ్యం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని మహదుగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ నిర్మల బాయ్ ఈనెల ఐదు నుండి కనిపించకుండా పోయిందని భర్త ప్రకాష్ శుక్రవారం సాయంత్రం బోత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎప్పటివలె సోనాల గ్రామానికి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుండి ఈ నెల ఐదున బయలుదేరిందని భర్త పేర్కొన్నారు ఇంటి నుండి వెళ్లిపోయినప్పటినుండి తిరిగి రాకపోవడంతో బంధువుల ఇండ్లలో వెతికామని ఎక్కడ కూడా ఆమె జడ తెలియకపోవడంతో ఫిర్యాదు చేశామన్నారు. అయిదవ తేదీన సోనాల గ్రామంలో తమ బంధువుల కు కనిపించినట్లు తెలిపారు అన్నారు. సోనాల నుండి ఎటు వెళ్లిన విషయం తెలియడం లేదన్నారు ఆమెకు 9 సంవత్సరాల కొడుకు ఏడు సంవత్సరాల కూతురు ఉందన్నారు. ఈ మేరకు స్థానిక ఎస్సై బి రాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.