మహిళా సాధికారత ప్రతి ఒక్కరి బాధ్యత

మహిళా సాధికారత కేంద్రం ఫైనాన్షియల్ లిటరసీ సంధ్య రాణి

సిరా న్యూస్,పెద్దపల్లి;
మహిళా సాధికారత ప్రతి ఒక్కరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం ఫైనాన్షియల్ లిటరసీ సంధ్య రాణి అన్నారు. మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కార్యాలయంలో కుట్టు మిషన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. టైలరింగ్ శిక్షణ పొంది ఉపాధి పొందే మహిళలను స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ కుట్టడానికి గుర్తించారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పెద్ద మొత్తంలో క్లాత్ కట్టింగ్ మిషన్లతో క్లాత్ కట్టింగ్ చేయడంపై రిసోర్స్ పర్సన్ అంజలి శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా మహిళా సాధికారత కేంద్రం ఫైనాన్షియల్ లిటరసీ సంధ్య మహిళల గురించి మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక ద్రవయోల్బణంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల పైన పొదుపు నిర్వహణ బడ్జెట్ గురించి వివరించారు. అలాగే ప్రతి ఒక్క మహిళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే బాలికల చదువు యొక్క ప్రాముఖ్యత గురించి, వారికి గల హక్కులు అధికారాలు చట్టాల గురించి వివరించారు. హెల్ప్ లైన్ నంబర్స్ సఖి సేవలు, చైల్డ్ హెల్ప్ లైన్ సేవలు, అంగన్వాడీ, సీనియర్ సిటిజన్స్ డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ, సైబర్ సెక్యూరిటీ గురించి టోల్ ఫ్రీ నెంబర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ రవీందర్, ఏడిఆర్డిఓ రవికుమార్, ఏపీఎం కళ్యాణి, జిల్లా సమైక్య అధ్యక్షులు సరస్వతీ, మహిళా సాధికారత కేంద్రం ఫైనాన్షియల్ లిటరసీ ఎస్. సంధ్య, రమ్య, ప్రతిభతోపాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *