వేతనాల కోసం అర్గుల్ రాజారామ్ గుత్ప ఎత్తిపోతల పథకం వద్ద నిరసనకు దిగిన కార్మికులు

సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎన్నో వేల ఎకరాల పంటలకు సాగునీరు అందిస్తుంది. ఎత్తిపోతల పథకం నందు పనిచేసే కార్మికులకు మాత్రం కాంట్రాక్టర్లు ఐదు నెలల నుండి వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఎత్తిపోతల పథకం ముందర నిరసన వ్యక్తం చేశారు. ఇందులో పని చేసే 19 మంది రవి ఎంటర్ప్రైజెస్ కింద 2008 కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ అయ్యారు. రవి ఎంటర్ప్రైజెస్ కిషోర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించగా కిషోర్ రెడ్డి తమిళనాడుకు చెందిన కన్నన్ కాంట్రాక్షన్ కంపెనీ కి కాంట్రాక్టును అప్పగించడంతో కన్నన్ ఏజెన్సీ వాళ్ళు ఐదు నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా డబ్బులు అడిగితే దూషణలు చేస్తున్నారని భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని జీతాలను ఇప్పించి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *