సిరా న్యూస్,నెక్కొండ;
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు )నెక్కొండ మండల శాఖ మండల ప్రధాన కార్యదర్శి చెలకలపల్లి వీరస్వామి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో చాగంటి వెంకటయ్య యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి( సిఐటియు )జెండా ఆవిష్కరణ చేసి అమరవీరులకు నివాళులర్పించారు అనంతరం మన ప్రేమికుడు సమ్మయ్య సహకారంతో పంచాయతీ ఆవరణలో కానుగ మొక్క నాటడం జరిగినది చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం ప్రాణాలర్పించిన రోజు మేడే అని గత 138 సంవత్సరాలకు పూర్వమే కార్మికులు శ్రమదోపిడికి గురవుతూ పనికి తగ్గ వేతనం లేని సమయం 18 గంటల పని విధానం తీవ్ర ఒత్తిడి తట్టుకోలేక రెండు లక్షల మంది కార్మికులు ఏకమై పోరాటం చేసి తమ ప్రాణాలనులైతం లెక్కచేయకుండా రక్తంలో పడి పుట్టిన జెండా ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించిన జెండాఎర్రజెండా కార్మికులకు కనీస వేతన చట్టాలు పిఏప్ ఈ ఎస్ఐ గ్రాడ్యుటి సౌకర్యాలు చెందాలంటే పోరాటమే సరైన మార్గమని భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అందుకు కార్మిక వర్గం అంతా మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధమై కార్మిక చట్టాలను కాపాడుకోవాలని అది సిఐటియు ఎర్ర జెండా తోటే సాధ్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఈదునూరి సాయిలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
========================