నులిపురుగుల నివారణ అందరి బాధ్యత

మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

సిరా న్యూస్,జగిత్యాల;
నులిపురుగుల నివారణ అందరి బాధ్యత అని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్ అన్నారు. గురువారం పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చైర్ పర్సన్
విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు ..
ఈ సందర్భంగా ఆమే
మాట్లాడారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణిస్తారని తెలిపారు. నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలను ప్రతీ విద్యార్థికి తప్పనిసరిగా వేయాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తోపాటు చుట్టూ ఉన్న వారినిసైతం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సమియోద్దిన్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *