సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా బీరంగూడ లోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. టిఫిన్ చేద్దామని కుటుంబ సభ్యులతో టిఫిన్ సెంటర్ కు వెళ్తే చట్నీలో పురుగులు తిరుగుతూ కనిపించడంతో ఒక్కసారి షాక్ కు గురయ్యారు. గిరాకీ ఎక్కువవడంతో నాణ్యత కరువై కంపుగొడుతున్న టిఫిన్స్, చట్నీస్ హోటల్ లో కనిపించాయి. ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతూ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ హోటల్ కు ఇండివిడ్యువల్ లైసెన్స్ లేదు, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ అన్నింటికి కలిపి ఒకే లైసెన్స్ ఉంది అది కూడా రెన్యూవల్ చేయకుండానే నడుపుతున్న వైనం ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీల్లో తేటతెల్లమైంది. ఇలాంటి హోటళ్లను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.