మెదక్ జిల్లాలో దారుణం

మంత్రాల నెపంతో మహిళలపై వరుస దాడులు
రెండు రోజుల్లో రెండు ఘటనలు
సిరా న్యూస్,మెదక్;
రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో డేగల ముత్తవ్వ అనే మహిళపై గుర్తు తెలియని దుండగుల పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంత్రాలు చేస్తుంది అనే అనుమానంతో దాడి జరిగినట్లు సమాచారం. మహిళ పరిస్థితి విషమంగా వుంది. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. బుధవారం నిజాంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో మంత్రాల నెపంతో మహిళపై దాడి జరిగింది.బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *