సిరా న్యూస్,చిత్తూరు;
తిరుపతి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భరద్వాజక అతి సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితులు సుదర్శన హోమం మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి దీప దూప నైవేద్యాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు. దేవస్థానం ప్రధాన అర్చకులు కర్ణాకర్ గురుకుల్, పౌరోహితులు అర్థగిరి మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.