సిరా న్యూస్,అమరావతి;
రాష్ట్రంలో చెత్త పన్ను వసూళ్లు నిలిచిపోయాయి. పట్టణాలు, నగరపాలక సంస్థలు, స్థానిక సంస్థలకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. చెత్త పన్ను పేరుతో పేదల నుంచి నెలకు 30 నుంచి 150 రూపాయలు గతంలోవసూలు చేసారు. 2001 నుంచి రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి 200 కోట్ల రూపాయలు వసూలు అయ్యేవి. అయితే, ప్రజలనుంచి ఆరంభం నుంచి చెత్త పన్ను వసూలు పై వ్యతిరేకత వచ్చింది. చెత్తను తరలించడానికి 2164 వాహనాలు కొనుగోలు చేసారు.
======