సిరా న్యూస్,పెనమలూరు;
కంకిపాడు మండలం దళితవాడ లో మంచినీరు ఇవ్వడంలో పాలకులు విఫలమయ్యారంటూ స్థానికులు భారీగా రాస్తారోకో చేశారు. పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై ఆందోళన కు దిగడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.అదే సమయంలో పెనమలూరు నుంచి ఉయ్యూరు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బోడె ప్రసాద్ వెళ్లిన వెంటనే జోగి రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జోగి రమేష్ ఆగి సమస్య అడిగి తెలుసుకున్నారు. బోడె ప్రసాద్ లేదు, బోడు ప్రసాద్ లేడు అంటూ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు మీకు న్యాయం చేయ లేదు అందుకే జగన్ నన్ను పంపారు. నేను ఇప్పుడే వచ్చ మీ సమస్య పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చారు.