సిరాన్యూస్, నాంపల్లి
తాగునీటి బోరు ఏర్పాటు: మాజీ సర్పంచ్ కాటం వెంకటయ్య
నాంపల్లి మండలంలోని నర్సింహులగూడెం ప్రజలు గత కొన్ని రోజులుగా నీటి సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. ఈవిషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్ కాటం వెంకటయ్య ప్రజల నీటి దాహం తీర్చాలని తన సొంత ఖర్చులతో బోరు వేశారు. శనివారం బోరు పనులను ప్రారంభించారు. దీంతో ప్రజలు నీటి కష్టాలు తీర్చినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.