సిరా న్యూస్, సైదాపూర్
గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి
* సైదాపూర్ ఎంపీడీవో యాదగిరి
ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని సైదాపూర్ ఎంపీడీవో యాదగిరి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎంపీడీవో యాదగిరి పంచాయతీ కార్యదర్శులు , ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో యాదగిరి మాట్లాడుతూ వేసవి కాలంలో మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కార్యదర్శులను ఆదేశించారు.ఉపాధి హామీ పనుల్లో భాగంగా 90 రోజులు నిండినటువంటి కూలీలకు వందరోల పని కల్పించవలసిందిగా ప్రతి గ్రామంలో 150 తక్కువ కాకుండా ఉపాధి కూలీలను పెట్టాలని అలాగే నర్సరీలో షెడ్,నెట్ , విధిగా నీరు పట్టవలసిందిగా, వేసవికాలంలో అవలంబించాల్సిన విషయాలపై దిశా నిర్దేశం చేశారు.అలాగే శానిటేషన్ సంబంధించి పూర్తిస్థాయిలో సిబ్బందిని పురమాయించాలని, ప్లాస్టిక్ ని ఎప్పటికప్పుడు రోడ్లపై కానీ వీధులలో గాని ఉండకుండా సగ్రిగేషన్ షెడ్ కి తరలించాలని వర్మీ కంపోస్ట్ తయారీ ,హరితహారం మొక్కలు, స్మశాన వాటిక పూర్తిస్థాయిలో వినియోగించాలని అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సమయపాలన పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్ శ్రీనివాస్, సంపత్, నరేందర్ రెడ్డి, సతీష్, రమ, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.