సిరా న్యూస్, ఓదెల
గుంపులలో పౌర హక్కుల దినోత్సవం : తహసీల్లార్ యాకన్న
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. సందర్భంగా గుంపుల దళిత కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్లార్ యాకన్నమాట్లాడారు. జాతి, కులం, మతం, వివక్షత లేకుండా అందరూ సమానులే అనే ఆలోచన కలగాలని తెలిపారు. కార్యక్రమంలో ఓదెల ఎంపీడీవో జి తిరుపతి, ఆర్ఐ నరసింగం పోత్క పల్లి ఏఎస్ఐ, ఏఈ సమ్మిరెడ్డి, గుంపుల కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు