సిరా న్యూస్,పెద్దపల్లి;
కరీంనగర్ పార్లమెంటు కిసాన్ కాంగ్రెస్ ఇన్చార్జిగా యాట మల్లారెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా యాట మల్లారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టిందో వాటిని వివరిస్తూ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని గెలుపు కొరకు కృషి చేస్తానని వారన్నారు. అలాగే ఆయన నియామకం పట్ల పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణ వేణి సురేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్, పెద్దపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నేతట్ల కుమార్ యాదవ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కొండి సతీష్, కాంగ్రెస్ నాయకులు యాట సంగీత్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.