సిరా న్యూస్,ఖానాపూర్
యాట వనిత కుటుంబానికి రూ. 10 వేల అందజేసిన పూర్వ విద్యార్థులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన యాట వనతికు అమె చదువుకున్న 1991- 2001 సంవత్సరం బీర్ నంది ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థులు రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. యాట వనితకు భర్త మల్లేష్ అనారోగ్యం కారణాలవల్ల మృతి చెందారు. వీరికి కుమారులు రిషి, రశ్మిత ఉన్నారు. యాట వనిత ఆర్థిక పరిస్థితులు ఆలోచించి బీర్ నంది స్కూలు పూర్వ విద్యార్థులు అందరం కలిసి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుధాకర్, సిహెచ్ రాజన్న, సుస్మిత ఎస్.కె ఇలియాస్, మల్లేష్, కొండ మహేందర్, ఎం రమేష్ కల సవిత సత్తయ్య, రమేష్, నరేష్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.