సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ పై వైసీపీ నేతలు దాడికి దిగారు. సర్కారుతోటలోని 46వ పోలింగ్ బూత్ లో ఘటన జరిగింది. దాడిలో పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ ఏజెంట్ గా సంతకం చేసేందుకు వెళ్లిన రత్నాకర్ పై కొంత మంది వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. సోలీసులు బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.