సిరా న్యూస్,నిజామాబాద్;
హెగ్డోలి కి చెందిన అనిల్ (28), శైలజ (24) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల దుష్ప్రచారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి కోటగిరి ఎస్. ఐ సందీప్ కు జంట పంపింది. నవీపేట్, బాసర గోదావరి నదీ ప్రాంతంలో పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపుర్ శివారులో రైల్వే ట్రాక్ పై ఇద్దరి మృతదేహాలను గుర్తించారు.