సిరా న్యూస్,కర్నూలు;
కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణ హత్య జరిగింది. బోయ రవి అనే యువకుడి పై కత్తులతో దాడి చేసారు. మద్యం మత్తులో అగంతకులు రవి తో ఘర్షణ పడ్డారు. గమనించిన స్థానికులు వారికి సర్దిచెప్పారు. ఇంటికి వెళుతున్న రవిపై దుండగులు మరోసారి కత్తులతో దాడి చేసారు. దాంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.