సిరా న్యూస్, ఆదిలాబాద్:
బ్రెయిన్ ట్యూమర్ తో జైనథ్ యువకుడు…
– చికిత్స కోసం డబ్బులు లేక అవస్థలు
– ట్యూమర్ తొలగించేందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యుల వెల్లడి
– దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రానికి చెందిన బోరి ప్రవీణ్ (30) బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఆయన గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యాడు. గమనించిన కుటుంబీకులు మహారాష్ట్రలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా, బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ట్యూమర్ తొలగించేందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో, చేతిలో డబ్బులు లేక అతన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్న ప్రవీణ్ చికిత్స కోసం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన పలువురు తమకు తోచినంత ఆర్థిక సాయం అందిస్తుండగా, మరింత మంది దాతలు ముందుకు రావాలని వారు వేడుకుంటున్నారు. 7036309517 (వోలేపు లక్ష్మణ్),
9848385946 (గుజ్జ ప్రశాంత్) నంబర్ లకు ఫోన్ పే గానీ లేదా గూగుల్ పే ద్వారా గానీ తమకు తోచిన ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.